నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం: GVL
ABN , First Publish Date - 2022-06-08T18:14:13+05:30 IST
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. డొక్కు ఫ్యాన్ పార్టీ మాయలు అందరికీ అర్థమయ్యాయని అన్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేది అప్పుల కోసమే కాదా అని ప్రశ్నించారు. లిక్కర్, ఇసుక మాఫియాలతో రూ.కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. జొన్నాడ వెళితే బీజేపీ నేత సోము వీర్రాజును అడ్డుకున్నారన్నారు. ఏపీని నిషేధిత ప్రాంతంగా ఏమైనా పరిగణిస్తున్నారా అంటూ నిలదీశారు. కేంద్ర సాయం, ఖర్చులు, పథకాలపై చర్చకు సిద్ధమని జీవీఎల్ స్పష్టం చేశారు.