తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు: ఎంపీ GVL
ABN , First Publish Date - 2022-07-11T18:06:58+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ అన్నారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ (GVL) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్లీనరీ(YCP Plenary)లో వారి నాయకుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని తెలిపారు. ఇటువంటి వింత పోకడలను వైసీపీ మానుకోవాలని హితవుపలికారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP)లో బానిసత్వ ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. కుటుంబ పాలన వ్యవస్థ దేశానికి ముప్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు.