తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు: ఎంపీ GVL

ABN , First Publish Date - 2022-07-11T18:06:58+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు: ఎంపీ GVL

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వింత పోకడలు చూస్తున్నామని ఎంపీ జీవీఎల్ (GVL) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్లీనరీ(YCP Plenary)లో వారి నాయకుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని తెలిపారు. ఇటువంటి వింత పోకడలను వైసీపీ మానుకోవాలని హితవుపలికారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP)లో బానిసత్వ ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. కుటుంబ పాలన వ్యవస్థ దేశానికి ముప్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. 


Updated Date - 2022-07-11T18:06:58+05:30 IST