ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణం: ఎంపీ GVL
ABN , First Publish Date - 2022-07-14T18:14:15+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL narasimharao) మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంపై కలెక్టరేట్ వద్ద బీజేపీ(BJP) చేపట్టిన నిరసనలో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి నిరసనలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాలలో చర్చిస్తామన్నారు. రాజకీయ కారణంగానే పేదలకు బియ్యం పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. బియ్యం సరఫరా చేస్తే ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందని జగన్ సర్కార్ ఈవిధంగా వ్యవహరిస్తోందని ఎంపీ జీవీఎల్ విమర్శలు గుప్పించారు.