ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ABN , First Publish Date - 2022-07-03T22:53:12+05:30 IST

లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ, రాష్ట్రీయ నేతలు పాల్గొన్నారు...

ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‎ (Hyderabad): హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (Bjp National Excutive Meeting) ముగిశాయి. రెండు రోజుల పాటు సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ, రాష్ట్రీయ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda), కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజకీయ తీర్మానాలపై చర్చించారు. తెలంగాణలో రాజకీయ తీర్మానంపై ఆమోదం తెలిపారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దేశంలో మరోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో జాతీయ బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-03T22:53:12+05:30 IST