బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఫ్లేవర్

ABN , First Publish Date - 2022-07-01T03:32:19+05:30 IST

బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేలకు సర్వం సిద్ధమైంది. జులై 2, 3 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ...

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఫ్లేవర్

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేలకు సర్వం సిద్ధమైంది. జులై 2, 3 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) హాజరుకానున్నారు. అయితే సమావేశాలకు సంబంధించిన వేదికలను తెలంగాణ (Telangana) ఫ్లేవర్‎ను జోడించారు. హెచ్ఐసీసీ నోవాటెల్ ప్రాంగణానికి శాతవాహన నగర్‎గా పేరు పెట్టారు. సమావేశాలు జరిగే హాల్‎కు కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా పేరు ఫిక్స్ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శల సమవేశం జరిగే మీటింగ్ హాలుకు వందేమాతరం రామచంద్రరావు పేరు, మీడియా పాయింట్ కు సోయాబుల్లాఖాన్ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా, బీజేపీ ఫుల్ టైమర్  వర్కర్స్ సమావేశానికి కొమురం భీం పేరు, భోజనశాలకు దళితుడైన భాగ్యారెడ్డి వర్మ పేరు ఖరారు, జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు, ఫోటో ఎగ్జిబిషన్ ప్రాంగణానికి గోల్కొండ పేరును నామకరణం చేశారు. 


Updated Date - 2022-07-01T03:32:19+05:30 IST