నేడు రాష్ట్రానికి తరుణ్ చుగ్

ABN , First Publish Date - 2022-06-14T14:42:37+05:30 IST

జాతీయ కార్యవర్గ సమావేశలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఈ సమావేశాల్లో భాగంగా బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నేడు రాష్ట్రానికి రానున్నారు.

నేడు రాష్ట్రానికి తరుణ్ చుగ్

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై అధిష్ఠానం స్పీడ్ పెంచింది. ఈ సమావేశాలపై చర్చలో భాగంగా బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నేడు రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు, పదాధికారులతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. జాతీయ కార్యవర్గ సమావేశాల‌ కోసం 34కమిటీలను నియమించనున్నారు. ఈ 34 కమిటీలకు తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా.. కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరవుతారు. వీరంతా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు.

Updated Date - 2022-06-14T14:42:37+05:30 IST