ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ: ఎమ్మెల్యే చిరుమర్తి
ABN , First Publish Date - 2022-05-20T06:48:20+05:30 IST
దేశంలో కుల, మతాలను రెచ్చగొడుతూ పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
రామన్నపేట, మే 19: దేశంలో కుల, మతాలను రెచ్చగొడుతూ పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండల కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 100 మంది లభ్ధిదారు లకు కోటి రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం కక్కిరేణి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. నిరుద్యో గులకు లక్షా 30వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గా లకు మేలు చేసే విధంగా పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ కన్నేబోయిన జ్యోతి బలరాం, కృష్ణారెడ్డి, ఉదయ్రెడ్డి, ఎడ్ల మహేందర్రెడ్డి, బిక్షంరెడి ్డ, శ్రీనివాస్, అమర్, మల్లేశం, దోమల సతీష్, పోతరాజు సాయి, రమేష్, గొరిగే నరసింహ, తాహసీల్దార్ జి.అంజనేయులు పాల్గొన్నారు.