టీఆర్‌ఎస్‌కు బీజేపే ప్రత్యామ్నాయం

ABN , First Publish Date - 2022-07-02T06:44:49+05:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే.సురేంద్రన్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌కు బీజేపే ప్రత్యామ్నాయం
సమావేశంలో మాట్లాడుతున్న సురేంద్రన్‌

కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్‌

పినపాక, జూలై 1: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే.సురేంద్రన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని జానంపేటలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ పార్టీ మండలాధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరైన సురేంద్రన్‌ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతం అవుతోందని, పార్టీ క్రియాశీల నిర్మాణం దిశగా సాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. 3న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ నాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి, రాష్ట్ర మోర్చా నాయకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి రామచందర్రాజు పటేల్‌ వెంకటనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:44:49+05:30 IST