‘బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి’
ABN , First Publish Date - 2021-07-27T06:48:59+05:30 IST
బీజేపీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త నాయకుడిలా కృషి చేయాలని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా శివనారాయణ పిలుపునిచ్చారు.
భానుగుడి(కాకినాడ), జూలై 26: బీజేపీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త నాయకుడిలా కృషి చేయాలని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా శివనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ భానుగుడి సెంటర్వద్ద సోముప్రసాద్ కళ్యాణ మండపంలో ఓబీసీ సర్వసభ్య సమావేశాన్ని ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా శివనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అనకాపల్లి ఇన్చార్జి కుండల సాయికుమార్యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.మాలకొండయ్య, కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ మాట్లాడారు. ఓబీసీలకు బీజేపీ ప్రత్యేక స్థానం కల్పిస్తోందన్నారు.