BJP ఆఫీస్‌లో ఘనంగా యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2022-06-21T15:24:48+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

BJP ఆఫీస్‌లో ఘనంగా యోగా దినోత్సవం

హైదరాబాద్: బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ (Bandi sanjay), బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్(Shiva prakash) ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఎవరో ఒకరు ఏదైనా అంశానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తే తప్ప సమాజం పాటించే పరిస్థతి లేదని అన్నారు. యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో పది మందితో యోగా చేసేలా కృషి చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. 


శివప్రకాష్ మాట్లాడుతూ... యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి నిత్యం యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో కార్యవర్గ సమావేశాల ఇంఛార్జ్ అర్‌వింద్ మీనన్, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-21T15:24:48+05:30 IST