మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్ మృతికి కారణం:బండిసంజయ్
ABN , First Publish Date - 2022-04-16T21:28:16+05:30 IST
మజ్దూర్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్పై పీడీయాక్ట్ పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లనే చనిపోయాడని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆరోపించారు.
గద్వాల్:మజ్దూర్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్పై పీడీయాక్ట్ పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లనే చనిపోయాడని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టే బీజేపీ కార్యకర్త సాయిగణేష్ పై పీడీయాక్ట్ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 16 కేసులు పెట్టిందని అన్నారు. బీజేపీ కార్యకర్త కాబట్టే సాయిగణేష్పై పీడీ యాక్ట్ పెట్టారని అన్నారు.అవినీతి మంత్రి పువ్వాడను సాయి గణేష్ ప్రశ్నించాడు. అందుకే అతడిపై కేసులు నమోదయ్యాయని అన్నారు.మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్ మృతికి కారణమని బండి సంజయ్ అన్నారు.