అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు

ABN , First Publish Date - 2021-01-17T06:24:02+05:30 IST

దేవాలయాలపై దాడుల వి షయంలో పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్య వహరిస్తున్నారని, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు

 లక్షమంది వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి.. 

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

పుట్టపర్తి, జనవరి 16: దేవాలయాలపై దాడుల వి షయంలో  పోలీసులు  అధికారపార్టీకి అనుకూలంగా వ్య వహరిస్తున్నారని, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక సాయిఆరామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల విష యంగా బీజేపీ తొలి నుంచి ఆందోళన చే స్తోందన్నారు. దేవాలయాలపై దాడులలో  ఏ పార్టీకి సంబంధం లేదని ప్రకటించిన డీ జీపీ  రెండు రోజులకే  మాట మార్చి బీజేపీ, మరో పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారంటూ ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న పోలీసులు ఆత్మపరిశీలన చేసుకుని విధులు నిర్వర్తించాలంటూ సూచించారు. కొందరు పోలీసులు ఏకంగా వైసీపీ నాయకుళ్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ము ఖ్యమంత్రి, హోం మంత్రి, ఇతర అధికారులు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. ఆంజనేయస్వామిపై విమర్శ చేసిన మంత్రి కొడాలినానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలపై దాడులు చేశానని ప్రచార మధ్యమాల్లో ఓ పాస్టర్‌ ప్రచారం చేస్తున్నా అతడిపై కేసుపెట్టకపోవడం చూస్తుంటే క్రైస్తవ మతానికి మద్దతు పలుతున్నట్టు తెలుస్తోందన్నారు. లక్షకుపైగా వైసీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియా ద్వారా విషప్రచారాన్ని చేస్తున్నారని వారిని వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఉత్తమరెడ్డి, హనుమంతరెడ్డి, కత్తిరాజ, కొండమరాజు, హరికృష్ణ, నారాయణ, శేషాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-17T06:24:02+05:30 IST