నందిగ్రామ్‌ నుంచి సువేందు, 57 మందితో బీజేపీ జాబితా

ABN , First Publish Date - 2021-03-07T01:02:11+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే తొలి, రెండవ విడత అభ్యర్థుల...

నందిగ్రామ్‌ నుంచి సువేందు, 57 మందితో బీజేపీ జాబితా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే తొలి, రెండవ విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. 291 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పూర్తి జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శుక్రవారం విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ తాజా జాబితా విడుదల చేసింది. టీఎంసీపై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని నందిగ్రామ్ నుంచి బీజేపీ పోటీలోకి దింపడం విశేషం. నంద్రిగ్రామ్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నందున ఈ నియోజకవర్గంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. 8 విడతలుగా జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27న మొదలై ఏప్రిల్ 29న ముగుస్తాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-03-07T01:02:11+05:30 IST