Uttar Pradesh Electios Result: 37 ఏళ్ల తర్వాత యూపీలో సీన్ రిపీట్..!
ABN , First Publish Date - 2022-03-10T16:53:06+05:30 IST
ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భారీ లీడింగ్లో దూసుకెళ్తోంది.
ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భారీ లీడింగ్లో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 250కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగి సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. దీంతో 37ఏళ్ల తర్వాత బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. 1985 తర్వాత యూపీలో ఏ సీఎం మళ్లీ ఎన్నిక కాలేదు. 1985 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ 269 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా నారయణ్ దత్ తివారీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 309 సీట్లు గెలుచుకుని సీఎం పీఠం దక్కించుకుంది. ఇప్పుడు ఇలా వరుసగా రెండుసార్లు(2017, 2022) సీఎం కావడం యోగికే దక్కింది.