Indian Independence day: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

ABN , First Publish Date - 2022-08-17T00:00:34+05:30 IST

బీజేపీ సౌత్ సెల్‌ సెక్రెటరీ ఎనుగందుల రవి అధ్వర్యంలో సోమవారం ముంబైలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Indian Independence day: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

ఎన్నారై డెస్క్: బీజేపీ సౌత్ సెల్‌(BJP south Cell) సెక్రెటరీ ఎనుగందుల రవి అధ్వర్యంలో సోమవారం ముంబైలో(Mumbai) స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో(Azadi Ka Amrith Mahotsav) భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉమాదేవి పాపాని 75వ జన్మదినం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తేజం, స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధీ అనుచరుడు అయిన పింగళి వెంకయ్య జయంతి వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలి.. దేశ చరిత్రలో కీలక ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.


సౌత్ సెల్‌కు ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న బీజేపీ కార్యదర్శి సచిన్ శిందే కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉమాదేవి పాపాని, ఆర్మీ సైనికులను ఆయన సత్కరించారు. ఆహుతులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మయూరి ఖేడేకర్, సూర్య కాంత్ దావలే, అక్షిత టెండూల్కర్, సుభేదార్ అశోక్ కదం, అక్షత ఎనుగందుల, అనురాధ పేర్ల, సెక్రెటరీలు మనోహర్ కారంపురి, చింత సుధామ, దామోదర్ పడాల, శ్రీకాంత్ మేక, రాజ్ పాల్ రాంపెల్లి, తెలుగు సమాజ్ సేవా సమితి ముఖ్యులు, సమాజ సేవకులు కటకం రాజన్న పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-17T00:00:34+05:30 IST