BJP Yatra: ఏపీలో మరో యాత్రకు బీజేపీ శ్రీకారం

ABN , First Publish Date - 2022-08-29T20:30:12+05:30 IST

రాష్ట్రంలో మరో యాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ నిర్ణయం తీసుకుంది.

BJP Yatra: ఏపీలో మరో యాత్రకు బీజేపీ శ్రీకారం

విజయవాడ: రాష్ట్రంలో మరో యాత్రకు బీజేపీ (BJP) శ్రీకారం చుట్టనుంది. రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ (AP BJP) నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు (Somu veerraju) యాత్రకు నాయకత్వం వహించనున్నారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 25 చోట్ల బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నాయకులు వివరించనున్నారు. 


Updated Date - 2022-08-29T20:30:12+05:30 IST