నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం: బండి
ABN , First Publish Date - 2021-08-31T00:40:37+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నగరంలో
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నగరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకొస్తే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. భూములను ఆక్రమించుకున్న కొందరు, వాటిని నిజాం ఆస్తులుగా ప్రచారం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.