BJP రాష్ట్ర అధ్యక్షుడిగా సీటీ రవి..?

ABN , First Publish Date - 2021-12-09T18:32:07+05:30 IST

రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీటీ రవికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు

BJP రాష్ట్ర అధ్యక్షుడిగా సీటీ రవి..?

- యడియూరప్ప కుమారుడికి మంత్రి పదవి 

- పరిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం


బెంగళూరు: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీటీ రవికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిన పార్టీకి అధికారంతో పాటు అనుకూలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఇందుకు కాంగ్రెస్‌ కూడా అతీతమేమి కాదనే చెప్పవచ్చు. దక్షిణాదిన ప్రధానమైన మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. మరోసారి ఎన్నికలు జరిగినా జాతీయ పార్టీలకు అవకాశం దక్కుతుందని నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ అధ్యక్షుడిగా బలమైన నేత డీకే శివకుమార్‌ సారథ్యాన్ని కొనసాగిస్తోంది. మాస్‌నేతగా కూడా పేరుండడంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలోను పార్టీపరంగా డీకే శివకుమార్‌ అనతికాలంలోనే పట్టు సాధించారు. అంతటి స్థాయిలో ప్రస్తుత అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీలు ధీటుగా దూసుకుపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఎక్కువ కాలం మంగళూరులోనే గడుపుతారనే విమర్శలు సొంతపార్టీలోనూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడే పా ర్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకు వెళ్లకుంటే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని దక్షిణాదిన 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనా ప్రభావం ఉంటుందని అధిష్ఠానం అప్రమత్తమైంది. యడియూరప్ప సామాజిక వర్గానికి చెందినవారే ముఖ్యమంత్రి బొమ్మై అయినా లింగాయతులలో యడియూరప్పకు ఉన్న పట్టును అంత తేలికగా తీసుకోవడం అ సాధ్యం. మరోవైపు ఒక్కలిగలు, బీసీలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారిని అక్కున చేర్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించడం అంత సమంజసం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. సీటీ రవికి అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా ఒక్కలిగ సామాజిక వర్గీయులను అక్కున చేర్చుకోవడంతోపాటు లింగాయతులలో పట్టుకొనసాగాలంటే యడియూరప్ప కుమారుడికి మంత్రి పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. దత్తపీఠ వివాదం ద్వారా రాణించిన సీటీ రవి రాష్ట్రమంతటా చిరపరిచితుడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే జాతీయస్థాయిలో ప్రధాన కార్యదర్శిగాను, పొరుగున ఉండే తమిళనాడుకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం త్వరలోనే సీటీ రవికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కల్పిస్తోంది. యడియూరప్ప, బొమ్మైల ద్వారా వీరశైవలింగాయతులను, నారాయణస్వామి, గోవింద కారజోళ ద్వారా దళిత సామాజికవర్గాన్ని, శ్రీరాములు, రమేశ్‌ జార్కిహొళి ద్వారా వాల్మీకి సామాజికవర్గీయులను, ఈశ్వరప్ప ద్వారా కురుబ సామాజిక వర్గీయులను అక్కున చేర్చుకోదలిచారు. ఎప్పుడైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-09T18:32:07+05:30 IST