రాష్ట్రంలో మళ్లీ అధికారం ఖాయం

ABN , First Publish Date - 2022-04-13T12:40:23+05:30 IST

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల స్ఫూర్తితో కర్ణాటకలో మళ్లీ అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌

రాష్ట్రంలో మళ్లీ అధికారం ఖాయం

                    - రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌


బెంగళూరు: ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల స్ఫూర్తితో కర్ణాటకలో మళ్లీ అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ పేర్కొన్నారు. బెళగావిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చత్తీస్ ఘడ్‌, రాజస్థాన్‌లో కూడా మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మూడు బృందాలుగా నేతలు పర్యటన చేపట్టారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల దరి చేరుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని, కర్ణాటకలోనూ వారికి అదే పరిస్థితి ఏర్పడనుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల కుమ్ములాటలే ఇందుకు కారణమన్నారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి గోవింద కారజోళతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-13T12:40:23+05:30 IST