State President: ఆయన త్వరలో మంత్రి అవుతారు...
ABN , First Publish Date - 2022-09-30T18:37:08+05:30 IST
రమేష్ జార్కిహోళి మరోసారి మంత్రి అవుతారని ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్
బెంగళూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రమేష్ జార్కిహోళి మరోసారి మంత్రి అవుతారని ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీలు(Nalin Kumar Katilu) పేర్కొన్నారు. బెళగావి లో గురువారం కటీలు మీడియాతో మాట్లాడుతూ రా ష్ట్రంలో 150 స్థానాలు గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రమే్షజార్కిహోళి వచ్చే ఎన్నికల ద్వారా కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్లకు రా జకీయ సన్యాసం ఇచ్చేలా పట్టుదలతో ఉన్నారన్నారు. రమేష్ జార్కిహోళి మంత్రి కావడం ఖచ్చితమని అయితే ఎప్పుడు చేస్తారనేది ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai)కు తీసుకునే నిర్ణయంపైనే ఉంటుందన్నారు. విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని ఇందులో ఎటువంటి వ్యత్యాసం లేదన్నారు. టికెట్ల కోసం ప్రయత్నించేవారు ప్రతి నియోజకవర్గంలోను ఎక్కువ మంది బయటకు వస్తున్నారన్నా రు. ఆశావాహులు పెరుగుతున్నారంటే పార్టీ శక్తి పెరుగుతున్నట్లే అన్నారు. సీబీఐ, ఐటీ శాఖలు అందరిపైనా దాడులు చేస్తాయని నిజాయితీగా ఉండేవారికి భయం ఎందుకని ప్రశ్నించారు. ధైర్యంగా ఆధారాలతో రికార్డులు చూపితే సరిపోతుందన్నారు. కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్(KPCC President DK Sivakumar)పై సీబీఐ దాడి నేపథ్యంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీను అప్పట్లో 9గంటల పాటు విచారణలు జరపలేదా, ప్రస్తుతం హోంమంత్రి అమిత్షాను జైలుకు పంపలేదా అప్పట్లో బీజేపీకు చెందిన మేం ఎవరైనా నిరసనలు, ఆందోళనలు చేశామా అని ప్రశ్నించారు. కర్ణాటక మిల్క్ఫెడరేషన్ అధ్యక్షులు బాలచంద్ర జార్కిహోళితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.