మత విధ్వేషాలకు BJP యత్నం: తమ్మినేని
ABN , First Publish Date - 2022-05-10T02:32:33+05:30 IST
తెలంగాణ ప్రజల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుటిల యత్నాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు.
సిరిసిల్ల: తెలంగాణ ప్రజల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుటిల యత్నాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. మతోన్మాద శక్తులకు తెలంగాణలో చోటివ్వవద్దని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలతో దేశానికి, పేదలకు ఎం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సరూర్నగర్లో హత్య చేయపడ్డ నాగరాజు హత్యను సీపీఎం ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలపై చట్టం తేవాలని వీరభద్రం డిమాండ్ చేశారు.