Ts News: మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతోన్న బండి సంజయ్

ABN , First Publish Date - 2022-05-22T03:34:19+05:30 IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Telangana Bjp Chief Bandi Sanjay) మరోసారి పాదయాత్రకు..

Ts News: మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతోన్న బండి సంజయ్

Hyderabad:  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Telangana Bjp Chief Bandi Sanjay) మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జూన్ 23 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు బండిసంజయ్ సమాయత్తమవుతున్నారు. జూన్ 23 శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివాస్‌ రోజున మూడో విడత పాదయాత్ర ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఖమ్మం (Kammam) లేదా వరంగల్ (Warangal) జిల్లాలో పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 20 రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే రెండు విడతల  పాదయాత్ర చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌లో ఆయన చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ నేతలు కూడా బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బండిసంజయ్‌‌ను  మద్దుతు తెలిపారు. ఈసారి తెలంగాణ బీజేపీ అధికారంలోకి ఖాయమంటూ జేపీ నడ్డా దీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-22T03:34:19+05:30 IST