తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్లు: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
ABN , First Publish Date - 2022-01-10T01:26:31+05:30 IST
వరంగల్: తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్లిస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన నిన్న కేసీఆర్ వామపక్ష నేతలతో ప్రగతి భవన్లో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని ప్రశ్నించారు.
వరంగల్: తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్లిస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ను నిరసిస్తూ ఆయన వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిన్న కేసీఆర్ వామపక్ష నేతలతో ప్రగతి భవన్లో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని బిశ్వశర్మ ప్రశ్నించారు. ఔరంగజేబ్, నిజాం వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని, పోలీసుల సపోర్ట్తో కేసీఆర్ ఎన్నిరోజులు పాలిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతృత్వం ఇక చెల్లబోదన్నారు.