Tarun Chugh: బండి సంజయ్ యాత్రపై టీఆర్‌ఎస్ నేతల దాడిని ఖండించిన తరుణ్ చుగ్

ABN , First Publish Date - 2022-08-16T19:24:21+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ నేతల దాడిని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.

Tarun Chugh: బండి సంజయ్ యాత్రపై టీఆర్‌ఎస్ నేతల దాడిని ఖండించిన తరుణ్ చుగ్

న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) యాత్రపై టీఆర్ఎస్ (TRS)నేతల దాడిని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ (KCR) అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. పోలీసుల తీరు కూడా సరిగ్గా లేదని అన్నారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారని...  పోలీసులు న్యాయం వైపు ఉండాలని హితవుపలికారు. బీజేపీ (BJP)లో చేరికలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్‌ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. అమిత్ షా మునుగోడు సభపై రేపు (బుధవారం) స్పష్టత ఇవ్వనున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. 

Updated Date - 2022-08-16T19:24:21+05:30 IST