కిరాయి మనుషులతో బీజేపీ, టీఆర్ఎస్ హడావిడి: Revanth
ABN , First Publish Date - 2022-07-04T23:30:20+05:30 IST
కిరాయి మనుషులతో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) హడావిడి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు.
ఢిల్లీ: కిరాయి మనుషులతో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) హడావిడి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్తో బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర పంచాయితీ చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీల భేటీలను ఔట్ సోర్సింగ్గా మార్చేశారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని రేవంత్ హెచ్చరించారు. ఇంధన ధరల పెంపుతో కేంద్రం ప్రజల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. విభజన హామీలపై మోదీ ఎందుకు మాట్లాడలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపై మోదీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం తప్పులను ఒప్పందం ప్రకారమే టీఆర్ఎస్ ఎత్తిచూపలేదని తప్పుబట్టారు. టీఆర్ఎస్పై మోదీ కూడా ఎలాంటి విమర్శలు చేయలేదని రేవంత్రెడ్డి విమర్శించారు.