ఆ వ్యాఖ్యలపై మేం కట్టుబడే ఉన్నాం: తరుణ్‌చుగ్

ABN , First Publish Date - 2022-01-06T00:35:21+05:30 IST

సీఎం కేసీఆర్ కుటుంబ పాలన వ్యాఖ్యలపై మేం

ఆ వ్యాఖ్యలపై మేం కట్టుబడే ఉన్నాం: తరుణ్‌చుగ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబ పాలన వ్యాఖ్యలపై మేం ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు.  బీజేపీ నేతలను బలవంతగా జైల్లో పెట్టలేరన్నారు. పోలీసులు పింక్ డ్రెస్ వేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిమినల్స్‌ను పట్టుకెళ్లినట్లు సంజయ్‌ని తీసుకెళ్లారన్నారు. 2014కు ముందు మీరు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఎంత సమయం ఉద్యమంలో ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజల కోసం బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-06T00:35:21+05:30 IST