మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం : గట్టు

ABN , First Publish Date - 2022-08-10T06:11:49+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం : గట్టు
మఠంపల్లిలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, ఆగస్టు 9: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేం దుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 13న నిర్వహించే ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమ ంలో వేముల శేఖర్‌రెడ్డి, చంద్రారెడ్డి, కోటిరెడ్డి, మురళి, గోపి, సతీష్‌, శివ, సోమ రాజు, ఉపేందర్‌, శ్రీను, వీరారెడ్డి, లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ, శంభిరెడ్డి ఉన్నారు.

మేళ్లచెర్వు: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని బీజేపీ రాష్ట్ర నా యకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి బూత్‌ నుంచి 15మంది క్రియాశీల కా ర్యకర్తలను తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేముల శేఖర్‌రెడ్డి, అన్నెపంగు అబ్బాస్‌, సత్యనారాయణరెడ్డి, వెంకటరామయ్య, గోపి, అచ్చాలు, రాజేష్‌, శంభయ్య, భూక్య శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మఠంపల్లి: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నా యకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని చౌటపల్లిలో జరిగిన సమా వేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు, అమలుకాని హామీలను జనాలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో నా యకులు వేములశేఖర్‌రెడ్డి, దుండిగల ఎల్లయ్య, కొర్లపాటి అమరయ్య, బొబ్బ వీరా రెడ్డి, బానోతు రంగానాయక్‌, బూసిపల్లి నాగలక్ష్మీ, బానోతు బాలునాయక్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-10T06:11:49+05:30 IST