బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2022-07-04T00:08:39+05:30 IST
బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఆయన హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ...
సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఆయన హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాహనంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ వేదికకు వెళ్లారు. సభా వేదికకు మోదీ చేరుకోగానే ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా బీజేపీ కార్యకర్తల అరుపులు, కేకలతో దద్దరిల్లింది. మోదీకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. జై బీజేపీ అంటూ సభా ప్రాంగణమంతా మారుమోగిపోయింది.