రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం
ABN , First Publish Date - 2022-07-02T06:31:58+05:30 IST
రాబోవు రోజుల్లో తెలంగాణ రష్ట్రంలో బీజేపీ అధి కారం చేపడుతుందని కేంద్ర ఓడ రేవులు, పర్యాటక శాఖ సహాయ మం త్రి శ్రీపాద నాయక్ జోస్యం చెప్పారు.
కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్
గొల్లపల్లి, జూలై 1 : రాబోవు రోజుల్లో తెలంగాణ రష్ట్రంలో బీజేపీ అధి కారం చేపడుతుందని కేంద్ర ఓడ రేవులు, పర్యాటక శాఖ సహాయ మం త్రి శ్రీపాద నాయక్ జోస్యం చెప్పారు. ఈ నెల హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పొల్గొంటున్న సందర్భంగా తెలంగాణ సంపర్క్ అభి యా న్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గొల్లపల్లి ఆర్యవైశ్యా సంఘం భవ నంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపుతు న్నారన్నారు. నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల ల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాల న్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచకపాలన కొనసాగిస్తు న్నారన్నారు. మార్గమధ్యలో మండలంలోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో ఉపా ధి కూలీలతో మాట్లాడి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, బీజేపీ మం డల శాఖ అధ్యక్షుడు కట్ట మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యద ర్శి ఎనగందుల శ్రీనివాస్, జిల్లా నాయకులు మరిపెల్లి సత్యం, కస్తూరి స త్యం, జాజుల మల్లేశం, కాడె సూర్యనారాయ, జెల్లా అనిల్కుమార్, మ హేంధర్, కచ్చు మల్లయ్య, భీమ మహేష్ పాల్గొన్నారు.