సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీలు: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-10-17T22:07:37+05:30 IST
బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ
కడప: బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. బద్వేలు ఉపఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఈ రెండు పార్టీలు కారణమని ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం రాకుండా చేశారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.