రిజర్వేషన్లపై బీజేపీ-ఆరెస్సెస్ కుట్ర: కారెం శివాజీ
ABN , First Publish Date - 2021-03-01T09:02:54+05:30 IST
రిజర్వేషన్లపై బీజేపీ-ఆరెస్సెస్ కుట్ర: కారెం శివాజీ
బర్కత్పుర, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను దెబ్బతీయడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ బీజేపీ-ఆరెస్సెస్ కుట్రపన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. దేశ సంపదను మోదీ ప్రభుత్వం కొల్లగొడుతోందని, కార్పొరేట్ సంస్థలకు రూ.4.8 లక్షల కోట్ల రాయితీ ఇచ్చిందని అన్నారు. పెరిగిన ధరలను తగ్గించడంలో మాత్రం కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ , గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.