చనిపోయిన యువకుడి ఆత్మ తన శరీరంలోకి ఆవహిస్తుందని మృతుడి భార్యకు చెప్పిన మంత్రగాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-02-11T05:36:51+05:30 IST
భర్త స్నేహితుడైన ఒక తాంత్రికుడు మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది...
భర్త స్నేహితుడైన ఒక తాంత్రికుడు మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లికి వెళితే.. గుజరాత్లోని ఛోటా ఉదయ్పూర్ నగరానికి చెందిన కోకిలబేన్(26) అనే యువతి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన మనూభాయ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. మనూభాయ్కి భక్తి భావం ఎక్కువ. అతను తనతోపాటు భార్యను తీసుకొని తరుచూ గుడికి వెళ్లేవాడు. సమీపంలోనే ఉండే తాంత్రిక బాబాజీ కూడా గుడి వస్తున్నప్పుడు మనుభాయ్ బాబాజీ ఆశీర్వాదం తీసుకునేవాడు. అలా గుడికి తరుచూ భర్తతో వెళ్లినప్పుడు కోకిలబేన్ బాబాజీ ఆశీర్వాదం తీసుకునేది.
కోకిలబేన్కు త్వరగా పిల్లలు కలగాలని దంపతులిద్దరూ బాబాజీని కోరగా ఆయన ప్రత్యేక పూజలు కూడా చేసేవాడు. ఆ సమయంలో ఆ బాబాజీ తాంత్రికుడు ఆ కోకిల అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. ఆమెను పొందాలనే కోరిక అతనిలో ఉండేది. కొన్ని రోజుల తరువాత కోకిలబేన్ భర్త మనూభాయ్ కరోనా వల్ల మరణించాడు. దీంతో భార్య కూడా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఆమెకు తన అత్తవారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి క్వారంటైన్లో ఉండమన్నారు. సమీపంలోనే బాబాజీ ఇంటిపై భాగం ఖాళీ ఉండడంతో కోకిలబేన్ అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అలా కోకిలాబేన్ క్వారంటైన్లో ఉన్నప్పుడు బాబాజీ తరుచూ ఆమె వద్దకు వెళ్లేవాడు. ఆమె భర్త మనూభాయ్ ఆత్మ తనను ఆవహిస్తుందని నమ్మబలికి ఆమెతో బలవంతంగా శృంగారం చేశాడు. ఆ తరువాత ఆమెను రోజూ లైంగికంగా హింసించేవాడు. దీంతో కోకిలబేన్ సహనం నశించి పోలీసులను ఆశ్రయించింది. తనపై బాబాజీ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలిసిన తాంత్రిక బాబాజీ ముందుగా పరారయ్యాడు. కానీ పోలీసులు అతడి ఆచూకీ 24 గంటల్లో తెలుసుకొని అరెస్టు చేశారు.