ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఆరుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-02-22T19:29:04+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బతు ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో..

ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఆరుగురు దుర్మరణం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బతు ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంగళవారంనాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సుమారు 12 మంది కార్మికులను తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కాగా, పేలుడుకు కారణంగానీ, ఎంత ఆస్తినష్టం సంభవించి ఉండవచ్చనేది కానీ తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-02-22T19:29:04+05:30 IST