బాచుపల్లి వెంచర్‌లో అక్రమ బ్లాస్టింగ్‌లు

ABN , First Publish Date - 2021-05-09T06:12:55+05:30 IST

బాచుపల్లి సర్వే 57లో అనుమతులు లేకుండా అక్రమ బ్లాస్టింగ్‌లు సాగిస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని

బాచుపల్లి వెంచర్‌లో అక్రమ బ్లాస్టింగ్‌లు

దుండిగల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): బాచుపల్లి సర్వే 57లో అనుమతులు లేకుండా అక్రమ బ్లాస్టింగ్‌లు సాగిస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు ఆకుల సతీష్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అండదండలతో సాగుతున్న ఈ అక్రమ బ్లాస్టింగ్‌లతో ఇంద్రానగర్‌కాలనీలో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అండదండలతో వెంచర్‌ ముందుగేట్‌కు తాళం వేసి మూడు ఎక్సకవేటర్లు పెట్టి జిలిటెన్‌ స్టిక్స్‌ పెట్టి బ్లాసింగ్‌లకు పాల్పడుతున్నారని, ఇదంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే పనులు నిలిపివేసి సంబంధిత వెంచర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోతే బ్లాస్టింగ్‌లు జరుగుతున్న ప్రాంతాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-05-09T06:12:55+05:30 IST