రైతులపై దాడికి వ్యతిరేకంగా కళ్లకు గంతలతో నిరసన

ABN , First Publish Date - 2020-11-29T05:34:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన లాఠీఛార్జి, భాష్ప వాయువు ప్రయోగాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌ పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

రైతులపై దాడికి వ్యతిరేకంగా కళ్లకు గంతలతో నిరసన
కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

గజ్వేల్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన లాఠీఛార్జి, భాష్ప వాయువు ప్రయోగాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌ పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సింహులు, ఇబ్రహీం, లక్ష్మణ్‌, మహమ్మద్‌ హైమద్‌, పోచయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:34:28+05:30 IST