నేవీ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2020-11-30T04:58:37+05:30 IST

నేవీ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమిలి ఐఎన్‌ఎస్‌ కళింగ నేవల్‌ స్టేషన్‌లో నిర్వహించిన ర క్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

నేవీ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
రక్తదానం చేస్తున్న నేవల్‌ అధికారులు

భీమునిపట్నం, నవంబరు 29: నేవీ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమిలి ఐఎన్‌ఎస్‌ కళింగ నేవల్‌ స్టేషన్‌లో నిర్వహించిన ర క్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని నేవల్‌ సర్జన్‌ రియర్‌ అడ్మిరల్‌, కమాండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీఎస్‌ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణం నగరంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిన నేపథ్యంలో నేవీ వారోత్సవాల్లో భాగంగా నేవల్‌ డాక్‌యార్డు, ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మ, ఐఎన్‌ఎస్‌ డేగాలలో ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళింగ నేవల్‌ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరానికి ఏఎస్‌ రాజా బ్లడ్‌బ్యాంక్‌ అధికారులు సహకారం అందించారన్నారు. ఈ శిబిరంలో 204 మంది రక్తదానం చేసినట్టు సీఎస్‌ నాయకుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-11-30T04:58:37+05:30 IST