TPAD ఆధ్వర్యంలో Dallasలో రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-09-04T22:07:49+05:30 IST
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్యర్యంలో డల్లాస్ నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరంలో..
డల్లాస్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్యర్యంలో డల్లాస్ నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరంలో టీపీఏడీ నిర్వహించిన రెండో రక్తదాన శిబిరం ఇది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు 51 మంది పేర్లు నమోదు చేసుకోగా.. 39 పింట్స్(18 లీటర్లు) రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అనురాధ మేకల, మామిడి రవికాంత్, సుంకిరెడ్డి మాధవి, రావు కల్వల, గోలి బుచ్చిరెడ్డిలతో పాటు టీపీఏడీకి చెందిన అనేక మంది వలంటీర్లుగా పనిచేశారు.
రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్రిస్కో, ప్లానో, అలోనో, కొప్పెలో తదితర ప్రాంతాలకు చెందిన యువతకు టీపీఏడీ కల్పిస్తోంది. రక్తదాన శిబిరం నిర్వహాణకు సహాకారం అందించిన ఐటీ స్పిన్ కంపెనీకి టీపీఏడీ ధన్యవాదాలు తెలిపింది. ఈ శిబిరానికి వచ్చి రక్తందానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.