Boat capsizes: గంగా నదిలో పడవ బోల్తా...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-09-02T12:57:48+05:30 IST

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని గంగా(Ganga) నదిలో పడవ మునిగిన(Boat capsizes) దుర్ఘటనలో ఐదుగురు...

Boat capsizes: గంగా నదిలో పడవ బోల్తా...ఐదుగురి మృతి

ఘాజీపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని గంగా(Ganga) నదిలో పడవ మునిగిన(Boat capsizes) దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. యూపీలోని ఘాజీపూర్ సమీపంలోని రియోటీపూర్ వద్ద గంగా నదిలో(Ganga River) ప్రజలు వారాంతపు సంతకు(weekly market) వెళ్లి పడవలో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. పడవలో 24 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 17మందిని కాపాడారు. పడవలో ఉన్న వారిలో ఏడుగురు గల్లంతు కాగా, ఐదుగురి పిల్లల మృతదేహాలు వెలికితీశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అరుణ్ సింగ్ చెప్పారు. 


సంధ్యాకుమార్(6), అనితా పాశ్వాన్(10), అలీసా యాదవ్(5), కుషాల్ యాదవ్(10), సత్యం (12)ల మృతదేహాలను గంగానదిలో నుంచి గజఈతగాళ్లు వెలికితీశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-09-02T12:57:48+05:30 IST