Bodhan జిల్లా ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-06-03T18:19:14+05:30 IST
బోధన్ జిల్లా ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది.
నిజామాబాద్: బోధన్ జిల్లా ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం కాన్పుల వార్డులో సీలింగ్ పెచ్చులూడింది. కాగా ప్రమాద సమయంలో పేషంట్స్, సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా ఆస్పత్రి భవనం శితిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.