చెరువులో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-06-24T12:34:50+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ గ్రామంలోని ఓ చెరువులో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి....

చెరువులో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ గ్రామంలోని ఓ చెరువులో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి. సర్పతాన్ పోలీసుస్టేషను పరిధిలోని జహ్రుద్దీన్ గ్రామంలో నివశించే రంజిత్(11), వీరు(12), సమీర్(12)లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాలేదు. పిల్లల కుటుంబసభ్యులు గాలించగా బుధవారం రాత్రి చెరువులో పిల్లల మృతదేహాలు లభించాయి. తమ పిల్లల్ని చెరువులో వేసి హత్య చేశారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా పిల్లలు చెరువులో మునిగి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పిల్లల మృతిపై దర్యాప్తు చేసి, హతమార్చిన వారిని అరెస్టు చేయాలని ప్రజలు రాస్తారోకో చేశారు. పిల్లల మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధరించడానికి పోస్టుమార్టం పరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-06-24T12:34:50+05:30 IST