వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం
ABN , First Publish Date - 2022-09-24T04:43:07+05:30 IST
మర్రిపూడి మండలంలోని రామాయపాలెం శివార్లలో ఉన్న వ్యవసాయ బావిలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహం బయటపడింది.
ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానం
మర్రిపూడి, సెప్టెంబరు 23 : మండలంలోని రామాయపాలెం శివార్లలో ఉన్న వ్యవసాయ బావిలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహం బయటపడింది. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఎస్ఐ పి.అంకమరావు కథనం ప్రకా రం.. కొండపి మండలం తాటాకులపాలెంకు చెందిన కొత్తపల్లి వెంకట్రావు (23) కుటుం బ సమస్యలతో ఉన్నత చదువులు చదువుకోలేకపోయాడు. దీంతో కొంతకాలంగా ఆ యన మనోవేదనలో ఉన్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకట్రావు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మరుసటిరోజు కూడా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోసం వెతుకులాడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రామాయపాలెంలోని వ్యవసాయ బావిలో ఓ మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆది వెంకట్రావుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆయన తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.