శరీర పరిపూర్ణత యోగాతోనే సాధ్యం
ABN , First Publish Date - 2021-06-22T04:53:23+05:30 IST
శరీర పరిపూర్ణత యోగా తోనే సాధ్యమవుతుందని భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రగౌడ్ అన్నారు.
-భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రగౌడ్
కాగజ్నగర్, జూన్ 21: శరీర పరిపూర్ణత యోగా తోనే సాధ్యమవుతుందని భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రగౌడ్ అన్నారు. సోమవారం 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కొని ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతా యన్నారు. ని త్యం కార్యక్ర మంలో యోగాగురువు దాసరి వినోద్గౌడ్, పతం జలి ప్రభారి హితేష్ అగర్వాల్, కిసాన్ పంచాయతీ ప్రభారి విధాన్ మండల్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: పట్టణంలో యోగా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు తిరుపతి ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. డిప్యూ టీరేంజ్ అధికారి ఝాన్సీలక్ష్మి, యోగా సాధ కులు తుకారాం, మారుతి, గీత, దేవేంద్ర, సుహాసిని, కల్పన, అశోమర్, సుజిత్, సైష్మ, హారిక, శ్లోక పాల్గొన్నారు.
రెబ్బెన: మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీపౌడెల్ నాయకులు, కార్యక ర్తలతో తననివాసంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగాగురువు అలేఖ్య, కృష్ణకుమారి, చక్రపాణి, ఆత్మారాం, సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొ న్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి ఇంటి వద్ద యోగాసనాలు వేశారు. టీబీజీకే ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్వోటు జీఎం సాయిబాబు, డీజీఎం రాజేంద్రప్రసాద్ పాల్గొ న్నారు.
వాంకిడి: మండల కేంద్రంలో యోగా శిక్షకుడు డోడ్డాజీ, దుర్గం తిరుపతి ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు. బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కోట్నక విజయ్, మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి): మండలంలోని భూపాలపట్నంలో ఎంపీడీవో రాజేశ్వర్, సర్పంచ్, కార్యదర్శులు యోగాసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీవో పేర్కొన్నారు.
చింతలమానేపల్లి: మండలంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు.