దొంగ ఓట్లు వేయడానికి కుప్పంలో మకాం

ABN , First Publish Date - 2021-11-15T07:38:47+05:30 IST

దొంగ ఓట్లు వేయడానికి పెద్ద దండే కుప్పంలో మకాం వేసింది.

దొంగ ఓట్లు వేయడానికి కుప్పంలో మకాం

కుప్పంలో దొంగల దండు


తిరుపతి, నవంబర్‌ 14: తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్నే కుప్పంలో అనుసరించబోతున్నారన్న ప్రచారం నిజమే అవుతోంది. దొంగ ఓట్లు వేయడానికి పెద్ద దండే కుప్పంలో మకాం వేసింది. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల నుంచి మూడు రోజుల కిందటే పలు రహస్య స్థావరాలకు బయటి వ్యక్తులను తరలించారంటున్నారు. వేల సంఖ్యలోనే నకిలీ ఓటరు కార్డులనూ ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు. పట్టణంలో అక్కడక్కడా అపరిచితులు కనిపిస్తుండడంతో ఆదివారం నాడు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.తమను బయటకు బలవంతంగా పంపించి, వైసీపీ వారిని మాత్రం కుప్పంలో ఎలా ఉండనిస్తున్నారంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. రహస్య తావుల్లో ఉన్న అపరిచితులను నిలదీశారు.ప్రజలకు స్వేచ్ఛగా ఓట్లు వేయాలని, తాము అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడానికి,స్వేచ్ఛగా ఓటేసేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం రానున్నారు.

Updated Date - 2021-11-15T07:38:47+05:30 IST