బొలేరో వాహనం బోల్తా - వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-01-24T04:00:05+05:30 IST
ప్రమాదవశాత్తు బొలేరో వాహనం బోల్తా పడటంతో పలువురికి గా యాలు కాగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
కృష్ణ, జనవరి 23 : ప్రమాదవశాత్తు బొలేరో వాహనం బోల్తా పడటంతో పలువురికి గా యాలు కాగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఇందుపూర్ గ్రామ శివా రులోని వెంకటరమణ దేవాలయం సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్ర త్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా సైదాపూర్ గ్రా మానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు (దాదాపు 20మంది) రాయిచూర్ గ్రామానికి వెళ్తుం డగా ఇందుపూర్ గ్రామ శివారులోకి రాగానే వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దాంతో మహిళలకు పిల్లలకు గాయాలయ్యాయి. అంబులెన్సుకు సమాచారం ఇచ్చినా సంఘటన స్థలాని కి రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో రాయిచూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు అయిన వృద్ధుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.