జోలె పట్టి రోడ్డు మరమ్మతులు చేయిస్తాం!
ABN , First Publish Date - 2022-08-09T07:10:18+05:30 IST
బొమ్మూరు, ఆగస్టు 8: బొమ్మూరు నుంచి రైల్వేస్టేషన్కు వెళ్లే రోడ్డులో భారీ గోతుల వల్ల రహదారుల్లో ప్రయాణం నరకంగా ఉందని టీడీపీ రూరల్ మండలాధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ వాపోయారు. సోమవారం బాలాజీపేట నుంచి బొమ్మూరుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుపై ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు నీటిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిత్యం తిరిగే ఈ రోడ్డు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇదే రోడ్డులో కారు చక్రాలు విరిగిపోయాయనీ, ఎంతోమంది రాత్రులు ద్విచక్రవాహనదారు
బొమ్మూరు, ఆగస్టు 8: బొమ్మూరు నుంచి రైల్వేస్టేషన్కు వెళ్లే రోడ్డులో భారీ గోతుల వల్ల రహదారుల్లో ప్రయాణం నరకంగా ఉందని టీడీపీ రూరల్ మండలాధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ వాపోయారు. సోమవారం బాలాజీపేట నుంచి బొమ్మూరుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుపై ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు నీటిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిత్యం తిరిగే ఈ రోడ్డు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇదే రోడ్డులో కారు చక్రాలు విరిగిపోయాయనీ, ఎంతోమంది రాత్రులు ద్విచక్రవాహనదారులు పడిపోతున్నారని తెలిపారు. 20వతేదీలోపు రోడ్డు వేయకపోతే 21 నుంచి ఇంటింటికి వెళ్లి జోలె పట్టి డబ్బులు సేకరించి రోడ్డు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ప్రజల రక్షణ కోసం టీడీపీ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.సత్యనారా యణ, రాజు, దుర్గా, వీరబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.