టీఆర్ఎ్సలో చేరిన బొంపల్లి ఎంపీటీసీ
ABN , First Publish Date - 2021-10-18T04:40:00+05:30 IST
టీఆర్ఎ్సలో చేరిన బొంపల్లి ఎంపీటీసీ
దోమ: మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్ మాన్యనాయక్, ఉపసర్పంచ్ శంకర్నాయక్, రాంజ్యా, దేవులనాయక్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదవర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వాటికి ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, నాయకులు రాఘవేందర్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్గౌడ్, క్రిష్ణారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఖాజాపాషా, రఫీక్, షేక్ఖాన్, వెంకటయ్య పాల్గొన్నారు.