1న సైదాబాద్‌ అమ్మవారి బోనాలు

ABN , First Publish Date - 2021-07-26T06:55:47+05:30 IST

భాగ్యనగర వాసులు ఆరాధ్యదైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్‌లో ఆగస్టు 1న ప్రారం భంకానున్నాయి.

1న సైదాబాద్‌ అమ్మవారి బోనాలు

సైదాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగర వాసులు ఆరాధ్యదైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్‌లో ఆగస్టు 1న ప్రారం భంకానున్నాయి. శ్రద్ధాబాద్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 1న ఆదివాకం బోనాల ఉత్సవం, 2వ తేదీ మధ్యాహ్నం 1-30 గంటల నుంచి అమ్మవారి ఘటం ఉరేగింపు, గావుపెట్టె, ఫలహరబండ్ల ఉరేగింపు, 3వ తేదీ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని శ్రద్ధాబాద్‌ మహంకాళి జాతర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

Updated Date - 2021-07-26T06:55:47+05:30 IST