నా భక్తులను కాపాడుకుంటా : భవిష్యవాణి

ABN , First Publish Date - 2021-07-27T07:22:17+05:30 IST

‘కరోనా కష్ట కాలంలో

నా భక్తులను కాపాడుకుంటా : భవిష్యవాణి
భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత. చిత్రంలో మంత్రి తలసాని

సికింద్రాబాద్‌, రాంగోపాల్‌పేట్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి):

‘కరోనా కష్ట కాలంలో కూడా నాకు పూజలు చేసి, నన్ను సంతోషపరిచారు. నా భక్తులను నేను కాపాడుకుంటా’ అంటూ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో మాతంగేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా తంబూర చేతపట్టుకుని, పచ్చికుండపై నిల్చుని, అమ్మవారు ఆవహించగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనాతో ఇబ్బందులు పడుతూ కూడా తనకు ఉత్సవాలు జరిపించారని, వర్షాలు, వరదలతో కష్టాలు వచ్చాయని, భక్తులను తాను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-07-27T07:22:17+05:30 IST