తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో కన్నుల పండువగా బోనాలు!

ABN , First Publish Date - 2022-07-19T05:27:44+05:30 IST

ఈ ఏడాది కోవిడ్ నిబంధలను కొంచెం సడలించడం వలన సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో చాల కన్నుల పండుగగా జరిగాయి .

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో కన్నుల పండువగా బోనాలు!

ఈ ఏడాది కోవిడ్  నిబంధలను కొంచెం సడలించడం వల్ల సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి.  ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు లోబడి ప్రజలు ఘనంగా బోనాలు సమర్పించారు. స్థానిక నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. సమస్త ప్రజలకు ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా నుండి పూర్తిగా ఉపశమనం కలిగించాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వందల మంది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపులో బోనాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింగపూర్‌కు ఈ బోనాల పండుగను ఆరేళ్ల  క్రితం పరిచయం చేయడం ద్వారా TCSS పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు చెప్పారు.  తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఇక్కడి ఏకైక తెలంగాణ సంస్థ టి‌సిఎస్ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్, దార అలేఖ్య ఉన్నారు. వీరితో పాటు ఫణి రోజా రమణి అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు. 


ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా.. నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్‌రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మై హోమ్’ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.


ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,  ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్,  రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, కాసర్ల శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,  ప్రవీణ్ మామిడాల మొదలైన వారు.. ప్రజలందరిపై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు. 

Updated Date - 2022-07-19T05:27:44+05:30 IST