వైభవంగా శిలోమాతమ్మకు బోనాలు
ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST
గుర్రంకొండ కోటలో వెలసిన శిలోమాతమ్మకు మహిళలు అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు.
గుర్రంకొండ, మే 20: గుర్రంకొండ కోటలో వెలసిన శిలోమాతమ్మకు మహిళలు అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు. గుర్రంకొండ తిరుణాల మొదటి రోజు అమ్మవారికి బోనాలను మహిళలు సమర్పించడం అనవాయితీ. ఇందులో భాగంగా గ్రామంలోని మహిళలు బోనాలను మోసుకుంటూ వచ్చి మొదట శిలోమాతమ్మకు మొక్కు చెల్లించారు. అనంతరం పోలేరమ్మకు బోనాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మ వారికి బోనాలు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో మహిళలు రాగా, ప్రతి మహిళకు ఎన్ఆర్ఐ శ్రీకాంత్ గాజుల స్టీల్ బాక్సులను అందజేశారు.